కూరగాయల సంచిలో మహిళ శవం

15 Aug, 2020 20:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతా, హరిదేవ్‌పూర్‌ ఏరియాకు చెందిన 60 ఏళ్ల సుజామణి గాయెన్‌ స్థానికంగా ఉన్న ఓ గుడి దగ్గర పూలమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సుజామణికి, ఆమె కోడలు సుజాతకు మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సుజాత, ఈమె తల్లి మలినా మండల్‌, మరో వ్యక్తి కలిసి సుజామణిని ప్రగతి మైదాన్‌లోని వారి ఇంటికి తీసుకెళ్లారు. (భూమి పూజ విషెస్‌: ‘అత్యాచారం చేసి చంపేస్తాం’)

అక్కడ తినే ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం విచక్షణా రహితంగా కొట్టి, గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచెలో కుక్కి, పైన కూరగాయలు నింపారు. దాన్ని పడేయటానికి టాక్సీ డిక్కీలో ఉంచి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు