ఘోర రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి

23 Jun, 2021 20:07 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని గోరంట్ల మండలం గుంతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా.. మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక నుంచి పుట్టపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా మృతుల్లో తల్లి, తండ్రి, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు