తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

12 Dec, 2020 16:21 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి

సాక్షి, చెన్నై: తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేలూరు జిల్లా ఆనకట్టు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఆంధ్రా నుంచి తమిళనాడుకు రాతి బండల లోడ్‌తో వెళుతున్న మినీ లారీ  అదుపు తప్పి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో వీ కోటకు చెందిన కార్మికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు గోవిందప్ప, రాముడు, వరదప్పగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.


 

మరిన్ని వార్తలు