సముద్రతీరంలో ముగ్గురు గల్లంతు

21 Mar, 2021 20:52 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని వేటపాలెం మండలం కటారిపాలెం సముద్రతీరంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఉషా(19), భరత్‌రెడ్డి(20)గా పోలీసులు గుర్తించారు. గల్లంతైన మహేష్‌ అనే యువకుడి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు