కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

16 Apr, 2023 07:47 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్‌ డిపోలో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మృతులంతా వరంగల్‌ జిల్లా ఒకే కుటుంబానికి చెందిన నరేష్‌, సుమ, బాబుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.


చదవండి: సవాల్‌ విసురుతున్న గుండెపోట్లు.. 

మరిన్ని వార్తలు