చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

26 Dec, 2020 06:49 IST|Sakshi

చిత్తూరు : జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఓమ్ని వ్యాన్‌ ఢీకొని ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకొని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన వారిలో రాజమ్మ(80), అన్నపూర్ణ(60), జ్యోతి(14) ఉన్నారు. మృతి చెందినవారిని కర్ణాటకలోని నంగిరి మండలం తొండపల్లి వాసులుగా గుర్తించారు.


మరిన్ని వార్తలు