Hyderabad: ఇంటి నుంచి బయటకెళ్లి.. ఇద్దరు వివాహితల అదృశ్యం

15 Apr, 2022 06:57 IST|Sakshi
లావణ్య, సంధ్య

సాక్షి, మల్కాజిగిరి: వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. హెచ్‌సీఓ మురళీకృష్ణ వివరాల ప్రకారం..కామారెడ్డి జిల్లాకు చెందిన లింగాపురం స్వామి ఆరు నెలల కిత్రం భార్య సంధ్య(23)తో కలిసి మల్కాజిగిరి బీజేఆర్‌లో నివాసముంటున్నాడు. స్వామి డ్రైవర్‌గా పనిచేస్తుండగా సంధ్య అనుటెక్స్‌లో సేల్స్‌ ఉమెన్‌గా పని చేస్తోంది. ఈ నెల 13వ తేదీ రాత్రి ఇంటికి వచ్చిన స్వామికి ఇంట్లో భార్య కనిపించలేదు. ఆమెకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ..
అల్వాల్‌: గృహిణి అదృశ్యమైన ఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. విశాఖపట్నం అక్కయ్యపాలేం కాలనీకి  చెందిన లావణ్య, మధు భార్యాభర్తలు. ఇటీవల లావణ్య నేరేడ్‌మెట్‌లోని తన పుట్టింటికి వచ్చింది. ఈ నెల 13వ తేదీన బయటకు వెళ్లిన లావణ్య తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇంట్లో గొడవపడి వ్యక్తి..
మల్కాజిగిరి: ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. హెచ్‌సీ సత్యనారాయణ వివరాల ప్రకారం.. రాజానగర్‌ కాలనీకి చెందిన నాగేందర్‌ (45) ఆనంద్‌బాగ్‌లో ఫ్లవర్‌ డెకరేషన్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 13వ తేదీ భార్య రూమాతో కుటుంబ విషయాలపై గొడవ పడ్డాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన నాగేందర్‌ రాత్రైనా రాకపోవడంతో రూమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు