క్రికెట్‌ ఆడుకోవడానికి వెళ్లి మృత్యువాత

28 Feb, 2022 09:10 IST|Sakshi

నిడమానూరు: ప్రకాశం జిల్లా  టంగుటూరు మండలం  నిడమానూరు లో విషాదం చోటు చేసుకుంది.  క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ముసి ఏటిలో  మునిగి మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు  మహేష్, వాసు, జగన్‌లుగా గుర్తించారు.

నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో ఇవ్వాళ ముసి కాలువ లో గాలించగా చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. లాకీగా వుండే చిన్నారులు ముగ్గురు చనిపోవడం తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు