నెల్లూరులో ట్రాక్టర్‌ బోల్తా: ఐదుగురు మృతి

4 May, 2021 12:49 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్‌ మండలం గొల్లకందుకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ చేపల చెరువులో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లో ఉ‍న్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

ఐదుగురి మృతితో వారి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), అబ్బుకోటిపెంచాలయ్య(60), తాంధ్రావెంకతరమనమ్మ(19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లంతా పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 


చదవండి: మరదలిని ఆరేళ్లుగా వేధిస్తున్న బావ.. దీంతో.. 

మరిన్ని వార్తలు