కృష్ణాలో ట్రాక్టర్‌ ట్రక్‌ బోల్తా: నలుగురి పరిస్థితి విషమం

15 May, 2021 12:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,  కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విసన్నపేట మండలం ముతారాశి పాలెం చెందిన ఓ ట్రాక్టర్‌ ట్రక్‌ శనివారం బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమ‍ంగా ఉండడంతో విజయవాడకు తలించారు. 14 మంది కూలీలకు గాయాలు కాగా, వారిని విస్సన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ప్రమాద సమయంలో ఆ ట్రక్‌లో 18 మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా మామిడి కోతకు ట్రాక్టర్‌ ట్రక్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
చదవండి: అమలాపురంలో మహిళ దారుణ హత్య

మరిన్ని వార్తలు