శంషాబాద్‌లో రవాణాశాఖా తనిఖీలు.. 11 విదేశీ కార్లు సీజ్‌

15 Aug, 2021 21:10 IST|Sakshi

హైదరాబాద్‌: శంషాబాద్‌ శివారులో రవాణాశాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో, విదేశాలకు చెందిన 15 వాహనాలపై రవాణాశాఖా అధికారులు కేసులను నమోదు చేశారు. కాగా, వీరు తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్యాక్స్‌ కట్టకుండా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పటికి 11 కార్లను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ బడాబాబుల నుంచి రూ. 5 కోట్లను జరిమాన రూపంలో వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు