భార్యతో గొడవలు.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. చివరికి..

27 Dec, 2022 08:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అన్నానగర్‌(తమిళనాడు): ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో ఆత్మహత్యకు యత్నించిన వివాహేతర జంట చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. నీలగిరి జిల్లా ఓల్డ్‌ ఊటీకి చెందిన జైశంకర్‌ (36) పెయింటర్‌. అదే ప్రాంతానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఉద్యోగరీత్యా తరచూ బయటి ఊరుకి వెళ్లేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నారు.

పెయింటర్‌ పనులకు వెళ్లే క్రమంలో జైశంకర్‌కు మేట్టుపాళయానికి చెందిన వివాహిత రాధతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాధను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం మేట్టుపాళయం నుంచి రాధను ఊటీలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో జైశంకర్‌ కుమారులు తండ్రితో మాట్లాడలేదు. దీంతో జైశంకర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

గత వారం రాధతో కలిసి ఊటీ బొటానికల్‌ గార్డెన్‌ను చూడటానికి వెళ్లాడు. జైశంకర్, రాధ అక్కడే విషం తాగి స్ఫృహ తప్పి పడిపోయారు. దీంతో పర్యాటకులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఇద్దరూ మృతి చెందారు. ఊటీ సెంట్రల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పరిశోధకుడు కాదు.. కామాంధుడు.. ప్రేమ పేరుతో లోబర్చుకుని..    

మరిన్ని వార్తలు