సంచనలం రేపిన జంట హత్యలు

3 Aug, 2020 07:39 IST|Sakshi

సాక్షి, నల్గొండ: జిల్లాలో దారుణం జరిగింది. అనుముల మండలం హాజరుగూడెం గ్రామంలో జరిగిన జంటహత్యలు సంచలనం రేపాయి. వివరాల్లోకెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి అనే ఇరువురి సోదరులను ఇంటి బయటు నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. వీరి మరో సోదరుడు హరిపై కూడా దాడి చేయగా తృటిలో తప్పించుకున్నాడు. సరిగ్గా ఏడాదిక్రితం వివాహేతర సంబంధం నేపథ్యంలో హజారిగూడెం వెళ్లొస్తున్న ఓ యువకున్ని హత్య చేసిన కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. ఆ కేసులో జైలుకు వెళ్లిన ముగ్గురు సోదరులు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. 

గతంలో హత్యకు గురైన యువకుడు.. హరి అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఉండగా.. ఆ గొడవల్లో ముగ్గురు అన్నదమ్ములు అతన్ని హత్య చేసినట్లు అభియోగం ఉంది. ఈ క్రమంలోనే గతంలో హత్యకు గురైన యువకుని తల్లి, మరో ఇద్దరి సాయంతో ప్రతీకారంగా ముగ్గురిని హత్యచేయడానికి ప్లాన్‌ చేసినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే చనిపోగా.. హరి తప్పించుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసుకొని విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు