పురుగుల మందుతాగి బాలుడి ఆత్మహత్య 

12 Mar, 2021 08:17 IST|Sakshi

సీతారాంపల్లి తండాలో ఘటన 

పండుగ పూట విషాదం 

వర్గల్‌(గజ్వేల్‌): కడుపు నొప్పి బాధ భరించలేక ఓ బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా శివరాత్రి పర్వదినం రోజు గురువారం వర్గల్‌ మండలం సీతారాంపల్లి తండాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గౌరారం ఏఎస్సై మధుసూదన్‌రావు కథనం మేరకు.. సీతారాంపల్లి తండాకు చెందిన అజ్మీర ధన్‌రాజ్, రూపా దంపతులకు అజయ్‌(16), వివేష్, ఆర్యా ముగ్గురు పిల్లలు ఉన్నారు. తూప్రాన్‌ చిల్డ్రన్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు అజయ్‌ కొంత కాలం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గురువారం అజయ్‌ తల్లిదండ్రులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ తల్లిదండ్రులు పొలం పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో కడుపునొప్పితో బాధపడుతున్న అజయ్‌ ఆ బాధ భరించలేక పురుగుల మందు తాగాడు. ]

కిందపడి పొర్లుతున్న కొడుకును తల్లిదండ్రులు గమనించి అక్కడికి చేరుకోగా పురుగుల మందు తాగిన విషయం తెలిపాడు. వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు పెనువిషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదం అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు.  

మరిన్ని వార్తలు