మహిళను చంపి.. రోడ్డుపై పడేసి..

27 Aug, 2020 14:31 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ వివాహితను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కావలిలోని పుచ్చలపల్లి వారి వీధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షకీల(25) అనే వివాహిత ఏడాది క్రితం భర్తతో విడిపోయి ఇస్లాం పేటలోని తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. కావలిలోని ఓ ప్లాస్టిక్ దుకాణంలో షకీల పని చేస్తోంది. అయితే ఆమె తరచూ పుచ్చలపల్లి వారి వీధిలోని  ఓ మహిళ ఇంటి వద్దకు వస్తుండేది. ( దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు )

ఈ క్రమంలోనే  గురువారం  కూడా షకీల ఆ మహిళ ఇంటికి వచ్చింది. అక్కడ గుర్తు తెలియని కొందరు వ్యక్తులతో ఆమెకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వారు షకీలను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు