Vikarabad Groom Suicide: పెళ్లయిన 20 రోజులకే.. 

27 May, 2022 15:42 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: పెళ్లి అయిన 20 రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన  మోమిన్‌పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మైపాల్‌(28)కు ఈ నెల 6న శిరీషతో వివాహమైంది. కాగా ఈ నెల 25న మైపాల్‌ భార్య శిరీష, తమ్ముడు అనిల్‌తో కలిసి భోజనం చేశాడు. అనంతరం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తలుపు గడిపెట్టుకోవాలని చెప్పాడు. రాత్రి 11గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో తమ్ముడు ఫోన్‌ చేశాడు. బస్టాండ్‌ వద్ద ఉన్నానని సమాధానం ఇచ్చాడు. తర్వాత ఫోన్‌ చేసినా స్పందించలేదు.

గురువారం ఉదయం బేగరి మల్లేశం వారి పొలానికి వెళ్లగా మైపాల్‌ తన పొలంలోని వేపచెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కన్పించాడు. దీంతో మల్లేశం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి అప్పులు ఉన్నాయని వాటిని ఎలా తీర్చాలని బాధపడుతుండే వాడని భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి.. 

మరిన్ని వార్తలు