Viral Video: షాకింగ్‌ ఘటన.. బార్‌లో సీక్రెట్‌ రూమ్‌.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు..

14 Dec, 2021 18:14 IST|Sakshi

Mumbai Dance Bar Raid: అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఓ బార్‌పై పోలీసులు దాడులు చేశారు. బార్‌ మొత్తం వెతికినా వారికి అక్కడ తప్పుగా ఏం దొరకలేదు. కానీ అక్కడున్న ఓ అద్దంపై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే అద్దాన్ని పగలగొట్టగా అక్కడ కనిపించిన దృశ్యం పోలీసులను షాక్‌కు గురయ్యారు. అద్దం వెనకాల ఓ సీక్రెట్‌ రూమ్‌ బయటపడింది. అందులోకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 యువతులు ఒకరి వెనక ఒకరు బయటకు వస్తుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. సీక్రెట్ బేస్‌మెంట్‌లో ఈ చీకటి దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.అసలు ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే.

వివరాలు.. ముంబై అంధేరిలోని దీప బార్‌పై ఆదివారం రాత్రి మహారాష్ట్ర పోలీసులు దాడులు చేశారు. దీప బార్‌లో యువతులను కస్టమర్ల ముందు వికృతంగా డ్యాన్స్‌ చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సదరు బార్‌పై దాడులు చేశారు. అయితే పోలీసుల దాడి గురించి సమాచారం అందుకున్న బార్‌ యాజమాన్యం అప్రమత్తమై యువతలను వెంటనే అడ్వాన్స్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ ద్వారా ఆపరేట్‌చేసే ఓ రహస్య గదిలోకి పంపారు.

దీంతో పోలీసులు గంటలపాటు బార్‌ మొత్తం సెర్చ్‌ చేసిన ఎవరూ దొరకలేదు. వాష్‌రూం, కిచెన్‌, స్టోర్‌రూమ్‌లలో వెతికినా మొత్తం ఖాళీగా ఉంది. దీంతో బార్‌ ఓనర్‌, మేనేజర్‌, వెయిటర్స్‌ను పోలీసులు విచారించారు. కానీ తమ బార్‌లో అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్స్ చేయించడం లేదని, ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ ఆరోపణలు కొట్టిపారేశారు.
చదవండి: నీతో శృంగారం నాకిష్టం లేదు.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య

అయితే పోలీసులకు అప్పటికీ నమ్మకం కలగలేదు. అంతేగాక మేకప్‌ రూమ్‌లో తగిలించి ఉన్న పెద్ద అద్దం పోలీసులకు అనుమానాన్ని కలిగించింది. పోలీసులు ఆ అద్దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా.. అది కుదరలేదు. అనంతరం పెద్ద సుత్తి తీసుకొచ్చి అద్దాన్ని పగలగొట్టారు. అప్పుడే అసలు విషయం బయట పడింది. అద్దం వెనకాల పెద్ద సొరంగంలా ఉన్న ఓ రహస్య గది ఉంది. ఆ గదిలోకి వెళ్లి చూడగా బార్ యాజమాన్యం గుట్టంతా బయటపడింది. కలుగులో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు ఈ సీక్రెట్ గదిలో నుంచి 17 మంది యువతులు బయటకు వచ్చారు.  17 మంది యువతలను పోలీసులు రక్షించి.. రెస్క్యూ హోంకు తరలించారు. 
చదవండి: జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే..

దీనికి సంబంధించిన వీడియోను ఓ ఎన్జీఓ ప్రెసిడెంట్‌ రాజ్‌ మజీ ట్విటర్‌లో షేర్‌చేశారు. దీంతో ఈ వీడియో సంచలనంగా మారింది. మోడ్రన్ డ్రెస్సులు ధరించి ఉన్న యువతులు ఆ గదిలో నుంచి ఒక్కొక్కరుగా బయట వస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే సీక్రెట్‌ రూమ్‌ను రిమోట్‌ కంట్రోల్ టెక్నాలజీతో ఆపరేట్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో బెడ్స్‌, ఏసీలు అన్నీ ఉన్నాయి. అంతేగాక రహస్య గదిలో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. బార్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్‌!

మరిన్ని వార్తలు