వరంగల్‌: చెరువు కట్ట నుంచి ట్రాక్టర్‌ బోల్తా.. ఐదుగురి దుర్మరణం! పెళ్లి సామాగ్రి కోసం వెళ్తుండగా

18 May, 2022 15:05 IST|Sakshi
ఘటనాస్థలంలోని దృశ్యం

సాక్షి, వరంగల్‌: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్‌ మండలం అశోక్‌ నగర్‌ దగ్గర చెరువు కట్టపై నుంచి కొంతమందితో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందడం‍తో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. 

పెళ్లి సామాగ్రి కోసం వాళ్లంతా నర్సంపేట ట్రాక్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు గుగులోతు సీతమ్మ(32), జాట్టోతు బిచ్య(45), గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు అదనపు సమాచారం అందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు