ప్రియుడితో కలిసి ప్లాన్‌; భర్తకు కాఫీలో విషం 

20 Jul, 2021 07:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మైసూరు: భర్తను చంపిన కేసులో భార్యను, ఆమె ప్రియున్ని మైసూరులో బన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. టి.నరసిపుర తాలూకాలోని హుణసగళ్ళిలో వెంకటరాజు హత్యకు గురి కాగా, అతని భార్య ఉమా, ప్రియుడు అవినాశ్‌ పట్టుబడినవారు. వెంకటరాజు దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమెకు అవినాశ్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అడ్డు తొలగించుకోవాలని ఇటీవల భర్తకు కాఫీలో విషం కలిపి ఇచ్చారు, అతడు స్పృహ తప్పిన సమయంలో తలదిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపారు.

మరిన్ని వార్తలు