అందరూ చూస్తుండగా భర్తను చితకబాదిన భార్య

12 Jan, 2021 17:59 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్న భర్తకు ఒక మహిళ తగిన రీతిలో బుద్ధి చెప్పింది.  బ్యాంకులో పనిచేస్తున్న అతడిని అందరూ చూస్తుండగానే చొక్కా పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన మంగళవారం వరంగల్‌లో  చోటుచేసుకుంది.

వివరాలు.. వరంగల్‌కు చెందిన శ్రీనివాస్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని  ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా 10 సంవత్సరాల క్రితం ఒక మహిళను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారికి ఒక పాప ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భార్యను పట్టించుకోవడం మానేశాడు.  

కాగా మహిళతో సహజీవనం చేస్తూ ఇంటికి రావడం తగ్గించిన శ్రీనివాస్‌పై అనుమానం వచ్చి అతను పని చేస్తున్న బ్యాంకుకు వెళ్లి నిలదీసింది. వేరొక మహిళతో కలిసి ఉంటూ నాకు అన్యాయం చేస్తావా అంటూ అందరు చూస్తుండగానే శ్రీనివాస్‌ చొక్కా పట్టుకొని చితకబాదింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన సిబ్బంది ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించినా ఎవరి మాట వినకుండా మరోసారి చితకబాదింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. 


 

మరిన్ని వార్తలు