-

కాళ్లపారాణి ఆరకముందే..

4 Apr, 2021 22:05 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జయిన కారు (ఇన్‌సెట్లో)  ధనూష

బనశంకరి : కారు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నెలమంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. చిక్కమడ్నూరు గ్రామం దారందకుక్కు  నివాసి గోపిక్‌ భార్య ధనూష (23) మృతురాలు. గోపిక్‌– ధనూషకు ఫిబ్రవరి 21న పెళ్లయింది. బంధువులతో కలిసి బెంగళూరులో బంధువుల ఇంటికి మారుతి వ్యాగనార్‌ కారులో బయలుదేరారు. శనివారం వేకువజామున  బెంగళూరు సమీపంలోని నెలమంగల వద్ద వీరి కారును కోళ్ల లారీ ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జుకాగా ధనూష తీవ్రగాయాలతో చనిపోయింది. భర్త గోపిక్‌ , బంధువులు శుభలక్ష్మీ, రూపా వేణుగోపాల్‌కు తీవ్రగాయాలు తగిలాయి. నెలమంగల పోలీసులు చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొత్త జంటకు ప్రమాదంలో విషాదం నెలకొంది.

 
 


 

మరిన్ని వార్తలు