నడిరోడ్డుపై మహిళ హత్య  

1 Mar, 2021 21:32 IST|Sakshi

బెంగళూరు : నడిరోడ్డులో మహిళ దారుణహత్యకు గురైన ఘటన బనశంకరిలోని హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆలీంబీబీ(35) అనే మహిళ హత్యకు గురైంది. ఈమె కుందలహళ్లిలో నివసిస్తూ ఇళ్లలో పనులు చేసేది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఐటీపీఎల్‌ మెయిన్‌రోడ్డు టెక్‌పార్కు వద్ద నడిచి వెళ్తుండగా రఫిక్‌ అనే వ్యక్తిని ఆమెను అడ్డుకుని గొంతుపై చాకుతో పొడిచి హత్యచేసి ఉడాయించాడని వైట్‌ఫీల్డ్‌ డీసీపీ దేవరాజ్‌ తెలిపారు. పోలీసులు చేరుకునేటప్పటికి ఆమె ప్రాణాలు వదిలింది.

రఫిక్, ఆలీంబీబీ ఇద్దరూ పశ్చిమబెంగాల్‌కు చెందినవారు. ఉపాధి కోసం నగరానికి వచ్చారు. నిందితుడు చీరల వ్యాపారం చేసేవాడు. ఆలీంబీబీ అతని వద్ద రూ.10 వేలు అప్పు చేసిందని, దీనిపై ఒకసారి గొడవ జరిగితే ఆమె చెప్పుతో కొట్టిందని సమాచారం. అప్పటినుంచి కక్షతో ఉన్న నిందితుడు హత్య చేశాడని డీసీపీ దేవరాజ్‌ తెలిపారు. పరారీలో ఉన్న రఫిక్‌ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు