ప్రియుడితో కలిసి భర్తపై దాడి 

12 Jun, 2021 21:04 IST|Sakshi

హోసూరు: వివాహేతర సంబంధం మానుకో అన్నందుకు భార్య, ఆమె ప్రియుడు భర్తపై దాడి చేశారు. హోసూరు తోటగిరి ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కార్తీక్‌ (26) ఇతడు సుల్తానా అనే యువతిని మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఆమె బెంగళూరుకు చెందిన వాహిద్‌ఖాన్‌ (18)తో అనే యువకునితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకొంది. ఇది తెలిసి కార్తీక్‌ ఇరువురినీ నిలదీశాడు. దీంతో ఆవేశం చెందిన భార్య, వాహిద్‌ఖాన్‌ దాడి చేశారు. కార్తీక్‌ సిఫ్‌కాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాహిద్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు