మరణించిన 75 రోజుల తర్వాత.. 

3 Mar, 2021 13:16 IST|Sakshi
నజీమా బేగం(ఫైల్‌)

సాక్షి, కామారెడ్డి : భర్త, మేనమామ కలిసి తన తల్లిని చంపారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తల్లి మరణించిన 75 రోజుల తర్వాత కూతురు కంప్లైంట్‌ ఇవ్వటంతో సీన్‌ రివర్స్‌ అయింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నజీమా బేగం(48) కామారెడ్డి, అశోక్‌ నగర్‌ కాలనీలోని కూతురు ఆస్మాబేగం వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో 75 రోజుల క్రింద నజీమా బేగం మరణించింది.  ఆమె మరణానికి గుండెపోటు కారణమని భావించారంతా.

అయితే గత కొద్ది రోజుల నుంచి ఆస్మా.. భర్త వెంకటస్వామి, మేనమామ షఫీలు తల్లి పేరు మీద ఉన్న ఆస్తులు అమ్మేయాలనీ ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. తల్లి మరణించిన రోజు ఆమె శరీరంపై గాయాలు ఉండటం ఇందుకు బలం చేకూర్చింది. ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్త ప్రారంభించారు. 75 రోజుల తర్వాత నజీమా బేగం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

చదవండి : భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య

మరిన్ని వార్తలు