చెట్టుకు ఉరివేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

8 Aug, 2021 20:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు : పెనుమూరు మండలం, కార్తికేయపురంలో విషాదం చోటుచేసుకుంది. సుకన్య అనే ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. తిరుమల టూటౌన్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుకన్య ఆదివారం వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుకన్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు