అర్ధరాత్రి ఇంటికి ప్రియుడు వచ్చి.. ఆ సమయంలో..

10 Apr, 2022 14:49 IST|Sakshi

మండ్య(బెంగళూరు): జిల్లాలోని మద్దూరు తాలూకా ఆతగూరు హోబలి కెస్తూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గ్రామ పంచాయతీ డి గ్రూపు ఉద్యోగిని సుమ (38) హత్యకు గురైంది. శనివారం ఉదయం ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈమె భర్త రాజణ్ణ డి.గ్రూప్‌ ఉద్యోగిగా పనిచేసేవాడు. వీరికి యోగేశ్‌ అనే టెన్త్‌ చదివే కుమారుడు హాస్టల్‌లో ఉంటున్నాడు.

రాజణ్ణ గతంలో చెరువులో చేపలు పడుతూ మునిగిపోయి మరణించాడు. తరువాత ఆమెకు భర్త ఉద్యోగం లభించింది. అర్ధరాత్రి ఆమె ఇంటికి ప్రియుడు వచ్చాడని, ఆ సమయంలో గొడవ పడి హత్యచేశాడని సమాచారం. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, 2017లో సుమ కొప్ప గ్రామ పంచాయతీలో జీపీ అధ్యక్షుడు చంద్రహాస్‌ అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు పెట్టింది. మండ్య సెషన్స్‌ కోర్టులో తగిన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు వీగిపోవడంతో చంద్రహాస్‌ విముక్తుడయ్యాడు.  

చదవండి: హాలీవుడ్‌ మూవీ రేంజ్‌.. స్మగ్లర్లను ఛేజ్‌ చేసి పట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు