వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

23 Dec, 2020 13:55 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలో  దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు బలైయ్యింది. వివరాల ప్రకారం..నిండు గర్భిణి ప్రసవం కోసం తాండూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది.  అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు లేరని సిబ్బంది చెప్పారు. తీవ్ర పురిటినొప్పులతో ఆసుపత్రి బాత్రూంలోనే శిశివును ప్రసవించింది. సమయానికి చికిత్స అందకే శిశువు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు