రామగుండంలో విషాదం: పిల్లలతో రైలు కిందపడ్డ తల్లి

11 Jul, 2021 21:22 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలుకింద పడి ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. రామగుండంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. అరుణ అనే మహిళ గోదావరిఖని 8వ కాలనీకి చెందిన ప్రవీణ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఏమైందో ఏమో.. శనివారం అరుణ.. కూతురు సాత్విక(2), కుమారుడు సాత్విక్‌(5)లతో కలిసి రైలు కింద పడింది. అరుణ, సాత్విక మరణించగా.. సాత్విక్‌ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కరీంనగర్‌ ప్రభుత్వానికి తరలించారు. 

మరిన్ని వార్తలు