ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన కన్నతల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నం

6 Aug, 2021 18:42 IST|Sakshi

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒక తల్లి.. తన ఇద్దరు చిన్నారులను ఉరేసి చంపింది. ఆ తర్వాత తాను కూడా.. చెరువులోకి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

అక్కడే ఉన్న కొంత మంది జాలరులు మహిళను గమనించారు. వెంటనే వారు.. చెరువులో దూకి మహిళ ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా‍ప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు