వివాహిత ఆత్మహత్య 

8 Jul, 2021 20:36 IST|Sakshi
మంజుల(ఫైల్‌)

సాక్షి, నిజాంపేట(మెదక్‌): అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నిజాంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట మండలం పరిధిలోని చల్మెడకు చెందిన పాక మంజుల(35) 15 ఏళ్ల క్రితం నిజాంపేటకు చెందిన పాక నాగరాజుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన రెండేళ్ల నుంచి మృతురాలిని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా నాగరాజు వేధించేవాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్ద మనుషులు నచ్చజెప్పినా అతడిలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి మళ్లీ కట్నం కోసం వేధించడంతో భోజనం అనంతరం కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో మృతురాలు మంజుల తన ఇంటిలోని దూలానికి ఉరి వేసుకొంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. ఆమె మృతి విషయాన్ని మృతురాలి తండ్రికి తెలిపారు. ఈ విషయంపై మృతురాలి తండ్రి కొత్తల నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భర్త నాగరాజుపై నిజాంపేట ఇంచార్జ్‌ ఎస్‌ఐ రాంచందర్‌ కేసు నమోదుచేశారు. మృతురాలికి ఇద్దరు కుమారులు సుశాంత్, బద్రీనాథ్‌ ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మా ర్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు