సాక్షి, హైదరాబాద్: అమ్మతనానికే మచ్చ తెచ్చేన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ మహిళ తన కొడుకునే అమ్మేందుకు చూసిన ఘటన హైదరాబాద్లోని హబీబ్ నగర్లో మంగళవారం జరిగింది. మధ్యవర్తి సాయంతో 40 వేల రూపాయలకు కొడుకును విక్రయిస్తుండగా సదరు మహిళ పోలీసులకు చిక్కింది. అయితే బాలుడిని అమ్మే సమయంలో ఆ మహిళ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మద్యవర్తిని కూడా స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.