ధర్మవరంలో దారుణం.. రెండేళ్ల కూతురి గొంతు కోసి..

13 Aug, 2021 14:14 IST|Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కూతురి గొంతు కోసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ధర్మవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణంలోని కొత్తపేటకు చెందిన మీనాక్షి అనే మహిళ కూతురు ప్రణతి(2) గొంతుకోసి చంపింది. అనంతరం చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మీనాక్షిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు