వివాహిత అసభ్యకర ఫొటోలు సోషల్‌ మీడియాలో..

22 Aug, 2020 19:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నిర్మల్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ముధోల్‌ మండల కేంద్రలో శనివారం చోటుచేసుకుంది. పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు సంబంధించిన అసభ్యకరమ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన సదరు మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భర్త ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చదవండి : సీక్రెట్‌ రూంలో సెక్స్‌ రాకెట్‌

మరిన్ని వార్తలు