మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

8 Apr, 2021 15:01 IST|Sakshi

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు ఉరిశిక్ష

సాక్షి, విజయవాడ: భార్య హత్య కేసులో భర్తకు ఉరిశిక్ష విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కృష్ణలంకలో 2019లో గర్భవతి అయిన భార్యపై పెట్రోల్‌ పోసి హతమార్చిన భర్త సుజిత్‌కు ఉరిశిక్ష విధించింది. 2019, జూన్ 15న ఫకీర్‌గూడెంలో జరిగిన ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కోర్టు.. భర్త బత్తుల సంబియార్ సుజిత్‌కు ఉరిశిక్షను విధించింది. ఈ తీర్పు పట్ల బాధితురాలి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
చదవండి:
అమ్మా .. ఎందుకిలా చేశావ్‌..
మేయరమ్మా... ఇదేంటమ్మా! 

మరిన్ని వార్తలు