బంజారాహిల్స్‌: పెళ్లి పేరుతో వంచింది..సహజీవనం చేసి...చివరికి

11 Mar, 2022 08:04 IST|Sakshi

బంజారాహిల్స్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదు నెలల పాటు సహజీవనం చేసి ఉడాయించిన యువకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... జవహర్‌నగర్‌ సమీపంలోని ఎస్‌.కె.నగర్‌లో నివసించే యువతి(24) ఓ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇటీవల ఆమెకు ప్రకాశం జిల్లాకు చెందిన కె.ప్రసాద్‌(23)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. 

పెళ్లి చేసుకుంటానని మెడలో పసుపుతాడు కట్టిన ప్రసాద్‌ ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఇటీవల రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుందామని ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది. రెండు నెలల గర్భం కూడా దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ కోరింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లిన ప్రసాద్‌ తిరిగి రాలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా గర్భానికి కారకుడైన ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 420, 417, 493 కింద కేసులు నమోదు చేశారు.  

(చదవండి: పేరు మార్చి.. ఏమార్చి!)

మరిన్ని వార్తలు