ప్రాణం తీసిన వివాహేతర సంబంధం 

22 Jan, 2021 07:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు :  వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణం తీసింది. ఈ ఘటన తమిళనాడులోని హొసూరులో జరిగింది. కృష్ణగిరి జిల్లా హొసూరు బేగిపల్లికి చెందిన హరి కుమారుడు శ్రీకాంత్‌ (21). ఇతను హొసూరు మునేశ్వరనగర్‌లో వున్న బైరోస్‌ అనే వ్యక్తి మాంసం దుకాణంలో పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో శ్రీకాంత్‌కు, యజమాని భార్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి బైరోస్‌ శ్రీకాంత్‌ను మందలించాడు. అయినా సంబంధం కొనసాగిస్తుండడంతో శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు నిర్ణయించాడు. ఈ క్రమంలో  బుధవారం శ్రీకాంత్‌ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు