అత్తమామలు కొట్టారని ఆత్మహత్య  

27 May, 2021 08:49 IST|Sakshi
ఇనుగంటివారిపేటకు చెందిన మృతుడు కిరణ్‌కుమార్‌  

సీతానగరం: మండలంలోని ఇనుగంటివారిపేటకు చెందిన బేదంపూడి కిరణ్‌కుమార్‌ (26) తన అత్తమామలు కొట్టారని కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బుధవారం ఎస్సై వై.సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఇనుగంటివారిపేటకు చెందిన కిరణ్‌ కుమార్‌కు ముగ్గళ్లకు చెందిన పోశివేణితో అయిదేళ్ల క్రితం వివాహం అయింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణతో మృతుని భార్య ముగ్గళ్లలోని పుట్టింటికి వెళ్లింది.

మంగళవారం కిరణ్‌కుమార్‌ తన భార్యను తీసుకువెళ్లడానికి అత్తింటికి వెళ్లగా అత్త నక్కా పోశిరత్నం, మామ వెంకటరత్నం దూషించి, కొట్టారని మనస్థాపంతో ముగ్గళ్ల శివాలయం వద్ద గల చెత్త నుంచి సంపద కేంద్రం వద్దకు చేరుకుని తన చావుకి అత్తమామలే కారణం అంటూ  పురుగుల మందు తాగుతున్న సెల్ఫీ వీడియో వాట్సాప్‌ గ్రూపులలో పోస్ట్‌ చేశాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా మంగళవారం రాత్రి 9 గంటలకు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రి సమాచారంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: మాయలేడి అరెస్టు
నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్‌

మరిన్ని వార్తలు