Kamareddy Crime: ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని.. వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి

16 May, 2022 12:34 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ప్రేమించిన అమ్మాయి దక్కుతుందో లేదోనని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సదాశివనగర్‌ మండలంలోని లింగంపల్లికి చెందిన ఎల్లారెడ్డి రాము(27) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. రాము కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె దక్కదేమోనని ఇఆదివారం తన వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా రాముకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు.
చదవడి: ఆర్థిక ఇబ్బందులుతో ఒకరు.. వరకట్న వేధింపులు తాళలేక మరొకరు..

► ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు