ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని..

30 Jan, 2022 08:11 IST|Sakshi
కార్తిక్‌ ( ఫైల్‌)

సాక్షి,జన్నారం(మంచిర్యాల): ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌లో జరిగింది. ఎస్సై సతీశ్, మృతుడి తల్లి సత్తవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్‌ గ్రామానికి చెందిన గొలాట రమేశ్‌ – సత్తవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కార్తీక్‌ సంతానం. జన్నారం ప్రభుత్వ పాఠశాలలో కార్తీక్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా యువతి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక్‌ ఈనెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు.

తర్వాత తన స్నేహితుడు నాగుల హరీశ్‌కు ఫోన్‌చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే హరీశ్‌ తన స్నేహితులు రమేశ్, వెంకటేశ్‌తో కలిసి కార్తీక్‌ ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ప్రైవేట్‌ వాహనంలో స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్‌ సూచన మేరకు కరీంనగర్‌లోని  ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కార్తీక్‌ తల్లి సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్‌ తెలిపారు.
చదవండి: ఫోన్‌లో కాల్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌.. భర్తపై అనుమానంతో..  

మరిన్ని వార్తలు