పైశాచికం: ఆరు నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ఒంటిపై పంటిగాట్లు గుర్తించి..

26 Jan, 2022 07:45 IST|Sakshi
నిందితుడు మహ్మద్‌ మోహిజ్‌   

పంజగుట్ట (హైదరబాద్‌): మైనర్‌బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. జహీరాబాద్‌కు చెందిన మహ్మ ద్‌ మోహిజ్‌ (20)ఎమ్‌ఎస్‌ మక్తాలో నివాసం ఉండే అక్క ఇంట్లో ఉంటూ జూబ్లీహిల్స్‌లో వెల్డింగ్‌ వర్క్‌ చేస్తుంటాడు.

ఇతడు అద్దెకు ఉండే ఇంట్లోనే, మరో కుటుంబం అద్దెకుంటోంది. వారి కూతురు (13)ను గత ఆరు నెలలుగా బిల్డింగ్‌పైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.  మంగళవారం బాలిక ఒంటిపై పంటిగాట్లు ఉన్న విషయం కుటుంబసభ్యులు గమనించారు.  మహ్మద్‌ మోహిజ్‌ చేసే పైశాచికం గూర్చి బాలిక చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

చదవండి: (కీచక హెచ్‌ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్‌)

మరిన్ని వార్తలు