2014 నుంచి నా టైం బాలేదు.. చనిపోతున్నా

7 Jan, 2021 08:56 IST|Sakshi

వికారాబాద్‌ : ‘కాలం కలిసి రావడం లేదు.. 2014 నుంచి నా టైం బాగా లేదు.. నేను చనిపోతున్నాను.. అమ్మా నాన్నా.. రైతు బీమా ద్వారా వచ్చే డబ్బులు మీరు తీసుకోండి’అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ యువ రైతు చెట్టుకు ఉరేసుకొని తనువు చాలించాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా బంట్వారంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన కర్రె నర్సింలు, స్వరూప దంపతుల పెద్దకొడుకు బాల్‌రాజ్‌ (27) కుటుంబానికి పదెకరాల పొలం ఉంది. ( ఫేస్‌బుక్‌ ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని..! )

ఈసారి వానాకాలం సీజన్‌లో పత్తి సాగు చేశారు. పంటలు సరిగా పండటం లేదని, అప్పులు తీసుకొచ్చి సాగు చేసినా ఫలితం లేకుండా పోతోందని బాల్‌రాజ్‌ కొంతకాలంగా వేదన పడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొలానికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


 

మరిన్ని వార్తలు