బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు

30 Apr, 2022 09:25 IST|Sakshi

పెందుర్తి: తనకు కాబోయే భార్య (బాలిక)ను గర్భవతిని చేసి ఆ తర్వాత మొహం చాటేసిన ఓ యువకుడిపై పెందుర్తి పోలీసులు పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. సీఐ కె.అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన ఓ మహిళ పెందుర్తి సమీపంలోని అయ్యప్పనగర్‌కు వలస వచ్చింది. ఆమె కుమార్తె (16)కి స్థానికంగా నివాసం ఉంటున్న టేకు ముత్యాలు అనే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు.

బాలికకు మైనారిటీ తీరిన తర్వాత వివాహం జరిపించాలని పెద్దల సమక్షంలో అంగీకారం చేసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ముత్యాలు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీనిపై తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు ముత్యాలుపై పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.   

బాలికపై అఘాయిత్యానిక పాల్పడ్డ వృద్ధుడు
కుమ్మరాపల్లి గ్రామంలో మైనర్‌ బాలికపై ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు శారీరక వేధింపులకు పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.రాజారావు తెలిపారు. ఎస్‌ వరప్రసాద్‌ (66) ఇదే గ్రామంలో నివాసం వుంటున్న ఎనిమిదేళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ఎస్పీ గౌతమి శాలి ఆదేశాల మేరకు సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ రాజారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

(చదవండి: భర్తపై ఇద్దరి భార్యల ఫిర్యాదు)

మరిన్ని వార్తలు