మార్ఫింగ్‌ ఫోటోలతో బెదిరింపులు

21 May, 2021 06:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఓ అపరిచిత యువతి.. వ్యక్తికి మార్ఫింగ్‌ ఫోటోలు పంపి బ్లాక్‌మెయిల్‌ చేసిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. మాగడి పట్టణానికి చెందిన వ్యక్తికి రెండు రోజుల క్రితం అపరిచిత నంబర్‌ నుండి కాల్‌ వచ్చింది. వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడుకున్నారు.  తరువాత యువతితో తాను సన్నిహితంగా ఉన్నట్టు మార్ఫింగ్‌ చేసిన ఫోటోలు, చాటింగ్‌ చేసిన వీడియో వచ్చాయి. దాంతోపాటు డబ్బులు పంపించాలని, లేదంటే ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరింపు మేసేజ్‌ వచ్చింది. దీంతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

చదవండి: Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం 
బ్లాక్‌మెయిలింగ్‌: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను

మరిన్ని వార్తలు