Vizag: ఏం జరిగిందో..? ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా..

12 Nov, 2022 19:31 IST|Sakshi
దోని జగదీశ్వరి(ఫైల్‌ఫొటో)  

అల్లిపురం(విశాఖపట్నం): ఇంటి నుంచి బయటికివెళ్లిన తన కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో కనకలవీధికి చెందిన దోని చంద్రకళ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ జి.సోమశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం దోని జగదీశ్వరి (24) తల్లిదండ్రులు చంద్రకళ, ఎల్లాజీరావులతో కలసి కనకలదిబ్బలో నివసిస్తోంది.
చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి..

ఈ నెల 10వ తేదీ ఉదయం 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఆమె కోసం నగరంలో పలు ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలోను వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిపోయిన జగదీశ్వరి ఎత్తు సుమారు 155 సెంటీమీటర్లు. చామనఛాయతో, గుండ్రని ముఖం కలిగి ఉందని, నీలం రంగు ఫ్యాంటు, బిస్కట్‌ కలర్‌ టీషర్టు వేసుకుని ఉందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 6440796010 ఫోన్‌ నంబర్లలో తెలియజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు