ఏం జరిగిందో.. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే.. అంతలోనే అదృశ్యం

16 Nov, 2022 18:11 IST|Sakshi
సౌమ్య (ఫైల్‌)

సిద్దవటం(వైఎస్సార్‌ జిల్లా): మండల పరిధి కడపాయపల్లె గ్రామ పంచాయతీలోని మంగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన సౌమ్య(20) అదృశ్యమైనట్లు తండ్రి నరసింహులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ తులసీనాగప్రాద్‌ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

సౌమ్య కడప నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. మంగళవారం కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో లేక పోవడంతో గాలించారు. గ్రామంలో కనిపించక పోవడంతో  సిద్దవటం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఉసురు తీసిన ఇద్దరితో వివాహేతర సంబంధం.. ద్రోహం చెయ్యొద్దంటూ..   

మరిన్ని వార్తలు