-

Raptadu: టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

31 May, 2022 14:30 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ కులానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎర్రపెద్దన్న టీడీపీ వర్గీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఇంటికి అడ్డుగా ఉన్న రచ్చబండను ఎర్రపెద్దన్న తొలగిస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఎర్రపెద్దన్న కిందపడి చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చదవండి: (ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు: మంత్రి మేరుగ నాగార్జున)

మరిన్ని వార్తలు