పేరెంట్స్‌తో కలిసి వ్యాక్సిన్‌ తీసుకున్న ఢిల్లీ సీఎం

4 Mar, 2021 11:31 IST|Sakshi

 దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్‌

వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న ఢిల్లీ సీఎం

జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకున్నారు. రెండవ దశ  కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆయన ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో వ్యాక్సిన్‌  మొదటి మోతాదును స్వీకరించారు. ప్రజలందరూ ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ సీఎంతో పాటు, ఆయన తల్లి దండ్రులు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవడం విశషం. అటు జమ్మూలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో  జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా  ఈ రోజు వ్యాక్సిన్‌ మొదటి మోతాదును తీసుకున్నారు. (ఈ రోజు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న దిగ్గజాలు)

చదవండి :  15 ఏళ్లుగా విసిగిపోయారు : ఎంసీడీలో ఇక ఆప్‌కే పట్టం


మరిన్ని వార్తలు