భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

28 Mar, 2023 23:44 IST|Sakshi

అమలాపురం రూరల్‌: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలానికి అమలాపురం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బుధవారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకూ భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. వీటికి ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్ల కోసం 9959 2255 76, 9959 22 5550 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అవసరమైతే రద్దీకి అనుగుణంగా భద్రాచలానికి అదనపు బస్సులు నడుపుతామని సత్యనారాయణమూర్తి తెలిపారు.

ఫస్టియర్‌ పరీక్షలకు 12,770 మంది హాజరు

రాయవరం: ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 12,770 మంది హాజరయ్యారు. మొత్తం 13,607 మంది హాజరు కావాల్సి ఉండగా, 837 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 11,735 మందికి గాను 11,203 మంది పరీక్ష రాశారు. 532 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 1,872 మందికి గాను 1,567 మంది హాజరయ్యారు. 305 మంది పరీక్ష రాయలేదని ఇంటర్మీడియెట్‌ బోర్డు డీవీఈఓ ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు