దేవరపల్లి: గోపాలపురం మండలం కరిచర్లగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామ సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ దేవరపల్లి పవన్కుమార్ (38) మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం జంగారెడ్డిగూడేనికి చెందిన పవన్కుమార్ గోపాలపురం మండలం భీమోలు గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకుని జంగారెడ్డిగూడేనికి కారులో వెళ్తూండగా, ఎదురుగా వస్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నవీన్కుమార్ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.