సెపక్‌తక్రాలో సత్తా

25 Feb, 2023 08:58 IST|Sakshi
సెపక్‌తక్రాలో గెలుపొందిన విద్యార్థిని అభినందిస్తున్న హెచ్‌ఎం, తదితరులు

ద్వారకాతిరుమల : మండలంలోని రామసింగవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని పాకనాటి బాల భవ్యశ్రీ రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో సత్తా చాటింది. పాఠశాల హెచ్‌ఎం ఎల్‌.వెంకటేశ్వరరావు విద్యార్థినితో పాటు, వ్యాయామ ఉపాధ్యాయుడు పాకా సతీష్‌ను అభినందించి, సత్కరించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన 63వ రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీల్లో, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అండర్‌–14 బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించిందన్నారు. జట్టు విజయంలో బాల భవ్యశ్రీ ముఖ్యపాత్ర పోషించిందని తెలిపారు. విద్యార్ధినికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు సతీష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు